ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మే నెల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి. నరసింహ తెలిపారు. ఈ శిబిరంలో పాటలు పాడటం, వ్యాస రచన, కవిత్వ రచన, స్పోకెన్ ఇంగ్లీష్, చారిత్రక నిలువరాళ్ల సందర్శన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. కెవి నరసింహ, గణేష్, చంద్రశేఖర్, అశోక్, శ్రీనివాస్, ప్రజాపతి తదితరులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం కృష్ణ మండలంలోని ముడుమాల గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిలువరాళ్ల వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.