అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె టిఫానీ భారత్లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పకళను చూసి టిఫానీ అబ్బురపడింది. ఆలయ ఆవరణలో 108 అడుగుల నీలకంఠ్ వర్ణీ విగ్రహాన్ని సందర్శించారు. టిఫానీ ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శిస్తారు.