ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం మొక్కల పంపిణీ
NEWS May 28,2026 11:07 pm
రామవరం ప్రశాంతి నికేతన్ నివాసంలో ముప్పిడి శ్రీనివాస్ పెద్దకర్మ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బంధుమిత్రులకు సుమారు 100 మొక్కలను పంపిణీ చేశారు. ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా మొక్కలు పంచాలని ప్రకృతి ప్రేమికుడు కెఎన్ రాజశేఖర్ సూచించగా, ఆయన చెల్లెలు దీకొండ కిరణ్మయి, బావ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇలా చేయడం ముప్పిడి శ్రీనివాస్కు నిజమైన నివాళిగా నిలుస్తుందని పేర్కొన్నారు.