పోలీస్ సిబ్బందికి సామగ్రి పంపిణీ
NEWS May 26,2026 02:42 pm
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. విధుల సమయంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు క్యాపులు, కూలింగ్ గ్లాసెస్ ఉపయోగపడతాయని డీఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇటువంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎస్సై నాగరాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.