నిత్యవసర సరుకులు పంపిణీ
NEWS May 26,2026 02:41 pm
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మారుమూల గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో పౌష్టిక ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల ఆరోగ్య ఖర్చుల కోసం కూడా సహాయం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాజియా, లావణ్య, మల్లేష్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.