MJVC ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం
NEWS May 26,2026 09:10 am
మక్తల్ అసెంబ్లీ పరిధిలోని గీతం హై స్కూల్లో ఎంజేపివిసి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెవి నరసింహ తెలిపారు. మంగళవారం (మే 26, 2026) నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మగానూర్, మక్తల్, ఉట్కూర్, నర్వ మండలాలకు చెందిన ఆసక్తి గల యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పాటలు, కవితలు రాయడం, పాటలు పాడడం, స్టేజ్పై మాట్లాడడం, స్వచ్ఛమైన రైటింగ్, సోషల్ మీడియాపై అవగాహన, మోటివేషన్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే నిలువురాళ్ల చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సందర్శనలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.