న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026 (BRICS Summit 2026)లో పాల్గొనేందుకు పుతిన్ భారతదేశం వస్తున్నారని రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు.