కోతుల బావి వివాదం.. కమిషనర్పై ఫైర్!
NEWS May 19,2026 10:41 pm
ఎమ్మిగనూరులో కోతుల బావి ఆంజనేయస్వామి ఆలయ భూమి వివాదంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి వల్లే పట్టణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఆరోపించారు. ఆలయ స్థలంలో షెడ్ల కోసం డబ్బులు వసూలు చేశారనే ప్రచారం ఉందన్నారు. దేవుడి భూమిని కాపాడాలని అడిగిన భక్తులపై కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.