రవి యాదవ్, హఫీజ్ బేగ్లకు సన్మానం
NEWS May 19,2026 10:42 pm
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కపిల ప్రభాకర్, కుంబాల నర్సింలు యాదవ్, విఠల్తో పాటు భజన మండలి సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.