భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) నియమితులైన ఎస్. పద్మావతి సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ను కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.