ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
NEWS May 18,2026 01:06 am
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు భానుడి ప్రతాపం చుక్కలు చూపించనుందని, బలమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటి రికార్డు స్థాయిలో నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.