పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS May 17,2026 01:54 pm
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో ఏకైక పార్కు ఇదొక్కటే అని, బాగు చేయించి పిల్లలకు ఆడుకోవడానికి అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కట్కం రాజేంద్ర ప్రసాద్, విలాసాగర్ రవి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.