శ్రీపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం
NEWS May 16,2026 11:31 pm
హిందూ సంస్కృతి చాలా గొప్పదని ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార ప్రముఖుల శంకరయ్య అన్నారు. శ్రీపురంలో సిరిపురంతో పాటు సమీప బస్తీలకు చెందిన ప్రాంత వాసుల హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన శంకరయ్య మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక నైతిక ధార్మిక విజ్ఞాన సంపదకు నిలయమని, ఎందరో మహనీయులు ఇక్కడ జన్మించి మన దేశ వైభవాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. విదేశాలకు ఆధ్యాత్మిక విజ్ఞాన వైదిక ధార్మిక బిక్ష పెట్టింది మన దేశమేనని పేర్కొన్నారు. నేడు సమాజంలో లవ్ జిహాది మతమార్పిడులు గోవదలు హిందువులపై ఆకృత్యాలు పెరిగిపోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు