రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
NEWS May 15,2026 03:20 pm
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణ్ను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషాద వార్త తెలుసుకున్న ఆయన స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తిలకించారు. కళ్యాణ్కు ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా, కుటుంబానికి ఆయనే ఆధారంగా ఉన్నారని స్థానికులు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో వికలాంగుల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.