తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
NEWS May 14,2026 11:53 pm
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే ఇంధన వినియోగం, ట్రాఫిక్, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. CM రేవంత్ స్వయంగా కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించే నిర్ణయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. నగర పరిసరాల్లో సీఎం కాన్వాయ్ను 2-3 వాహనాలకే పరిమితం చేయాలనే ఆలోచనపై కసరత్తు చేస్తున్నారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.