కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క సాయగౌడ్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. అనంతరం చుక్క సాయగౌడ్ను సదాశివనగర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాయగౌడ్ తెలిపారు.