పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
NEWS May 13,2026 10:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని నిర్ణయించారు. జిల్లా పర్యటనల్లో అనవసర వాహనాలు వినియోగించవద్దని సీఎం అధికారులకు ఆదేశించారు. మంత్రులు ఇదే విధానం పాటించాలని సూచించారు. సీఎం బాటలోనే పవన్ కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గించాలని భద్రతా సిబ్బందికి సూచించారు. ఇంధన పొదుపు అవసరమని కేంద్రం సూచించడంతో రాష్ట్ర నాయకత్వం వెంటనే స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.