దాడిని ఖండించిన అనిల్ కూర్మాచలం
NEWS May 07,2026 05:16 pm
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడి చేయడాన్ని NRI BRS వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పట్టపగలు దాడులకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.