బీజేపీ నన్ను హత్య చేయాలని చూస్తోంది
NEWS May 07,2026 12:47 pm
కరీంనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. తనను బీజేపీ నేతలు హత్య చేయాలని చూస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన బీజేపీ నేతలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.