ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆడబిడ్డల పెళ్లికి ఈ పథకం కింద రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.