‘పుష్ప 2’ విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్, అతడి కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అండగా ఉంటామని కుటుంబానికి భరోసా కల్పించారు. శ్రీతేజ్ సోదరితో మాట్లాడిన అల్లు అరవింద్ ఆమెను చదిస్తానని హామీ ఇచ్చారు. ‘పుష్ప 2’ (2024 డిసెంబరు) ప్రీమియర్ షో వేళ జరిగిన తొక్కిసలాటలో.. శ్రీతేజ్ తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్కు తీవ్ర గాయాలు కాగా.. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.