నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపుతారా?
NEWS May 06,2026 08:29 pm
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్టు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఫైర్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, సీఎం కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.