నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం, పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆశయాలకు, పార్టీ ప్రజాసేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.