తెలుగులో ప్రచారం.. MLAగా విజయం!
NEWS May 06,2026 03:37 pm
తమిళనాడులోని శివకాశి నుంచి పోటీ చేసిన కీర్తనా సంపత్ సంచలన విజయం సాధించింది. రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు. డేటా అనలిస్ట్గా, రాజకీయ వ్యూహకర్తగా చేసిన కీర్తనా హైదరాబాద్లో TDP సోషల్ మీడియా లీడ్గా పనిచేసే సమయంలో తెలుగుపై పట్టు సాధించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగులో మాట్లాడి ఓటర్లను ఆకట్టుకున్నారు. TVK పార్టీ నుంచి శివకాశి టికెట్ దక్కించుకుని, గెలిచిన తొలి మహిళ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.