చీరలను పంపిణి చేసిన కౌన్సిలర్
NEWS May 06,2026 11:46 pm
కామారెడ్డి: అడ్లూర్ మహిళ సమాఖ్య భవనంలో ఇందిరా మహిళ శక్తి చీరలను మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ జాదవ్ మోతిలాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూరి భూమయ్య, జీపీవో భూమేష్, ఆర్పీ చంద్రకళ, కుంబాల గంగరాజు, ఈశ్వర్, మహిళలు పాల్గొన్నారు.