పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బెంగాల్లో బీజేపీ 206 సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోగా.. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 77 స్థానాల్లోనే విజయం సాధించింది. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే.