10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
NEWS May 04,2026 10:47 pm
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్ సాధించగా, పాఠశాల వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. 500కు పైగా మార్కులు 30 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ఈ విజయంపై కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.