ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి ఎంపీకి వినతి
NEWS May 04,2026 06:21 pm
కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు కోరారు. శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మీనారాయణ, కార్యదర్శి సంకేపల్లి నాగేంద్ర శర్మ, శ్రీ అరబిందో సొసైటీ కరీంనగర్ సెంటర్ అధ్యక్షుడు కోల అన్నారెడ్డి, ఉప్పల రామేశం, విశ్రాంత ఉపాధ్యాయులు, కవి వెల్ముల జైపాల్ రెడ్డి తదితరులు ఈ డిమాండ్ను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం కరీంనగర్ ఆకాశవాణి కేంద్రంలో సాంకేతిక పరమైన సదుపాయాలు పాతబడిపోయాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.