షబ్బీర్ అలీని కలిసిన మండల అధ్యక్షులు
NEWS May 04,2026 10:45 pm
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన మండల అధ్యక్షులను నాయకులు కోరారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ మండల కమిటీలతో పాటు యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ పార్టీ శక్తిని గ్రామ స్థాయి నుంచి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, నూతన మండల అధ్యక్షులు పాత రాజు, ఆశబోయిన శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, నోషిలాల్, మాజీ మండల అధ్యక్షులు అనంత్ రెడ్డి, సుతారి రమేష్, కౌన్సిలర్ మోతిలాల్, మాజీ జడ్పీటీసీ తీర్మాల్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఇంద్రాసేన రెడ్డి, సర్పంచులు ఇరేణి నర్సయ్య, సదర్ నాయక్, అనిల్, సంతోష్ రెడ్డి, సంతోష్ భూక్యా, స్వామి తదితరులు పాల్గొన్నారు.