ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్కు ఎస్జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించింది. ఈ నెల చివర్లో రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు అవార్డు అందిస్తారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ఆయన 300 కథలు, 7 నవలలు, 5 నాటికలు రాసి, 12 కథా సంకలనాలు ప్రచురించారు. పలు సినిమాలకు కూడా రచనలు అందించారు. పెద్దింటి రాసిన జిగిరి నవల 12 భాషల్లోకి అనువాదం అయింది.