బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. వివిధ రౌండ్లలో ఫలితాలు ఉంటాయి కాబట్టి.. దాదాపు మధ్యాహ్నం వరకూ ఆధిక్యాలు, ఆ తర్వాత స్పష్టంగా ఎవరు గెలిచారో తెలుస్తుంది. పార్టీలన్నీ హోరాహోరీగా పోరాడటంతో.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ పార్టీ అనూహ్య ఫలితాల దిశగా సాగుతోంది.