పార్కును పరిశీలించిన కౌన్సిలర్
NEWS May 04,2026 09:16 am
కోరుట్ల: సాయిరాంపుర్ కాలనీలో జాతీయ రహదారి పక్కన ఉన్న పిల్లల పార్కును కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ పరిశీలించారు. పార్కులో పాడైన చిన్నారుల ఆట పరికరాలను ఆయన పరిశీలించి, వాటి పరిస్థితిని మున్సిపల్ కమిషనర్కు నివేదిస్తానని తెలిపారు. పట్టణంలో ఏకైక పార్కు కావడంతో, పాడైన పరికరాలను త్వరలోనే మరమ్మతు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, విలాసాగర్ రవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.