ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
NEWS May 03,2026 05:45 pm
ఇంటర్లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ, బంజారా కాలనీ, కుంటినాగుల గూడెంలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గణేష్ మాట్లాడుతూ 10 తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్, సాంకేతిక కోర్సులు ఉన్నా ఇంటరే భవిష్యత్తుకు పునాది అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు.