మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
NEWS May 03,2026 05:45 am
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, యువ నాయకుడు ఇలియాస్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి రావడానికి సహకరించిన షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని నౌసిలాల్ నాయక్ పేర్కొన్నారు.