పబ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
NEWS May 02,2026 10:33 pm
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహరి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం వార్తల్లో లేకపోవడం విచిత్రమని అన్నారు. ఇతర నేతల చిన్న కార్యక్రమాలకు పెద్ద ప్రచారం లభిస్తోందని, కానీ బీసీ మంత్రికి జరిగిన అభివృద్ధి కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. మంత్రి ప్రజాదరణను కొంతమంది తట్టుకోలేకపోతున్నారని పేర్కొంటూ, బీసీలు ఇకనైనా మేలుకోవాలని పిలుపునిచ్చారు.