జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శనివారం దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ టెస్ట్ను చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రజలకు మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది గట్టి శబ్దం లేదా వైబ్రేషన్తో రావచ్చు. అలర్ట్ వ్యవస్థ సమర్థతను టెస్ట్ కోసమే ఈ మెసెజ్ పంపిస్తున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడలేదని గమనించాలి. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ఉద్దేశం.