హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద ORRపై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాగనార్ కారు శంషాబాద్ వైపు వేగంగా వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో 7గురు ఉన్నారు. ఘటనా స్థలంలోనే 6గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మహిళను ఆస్పత్రి తరలించారు.