పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
NEWS May 01,2026 05:51 pm
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. భారత్లో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచలేదు. ఇటీవల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25–28 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా.