తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
NEWS May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు. 2 రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు కూడా ఇదే వింత వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలతో బాటు వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.