విశాఖ బాలికకు 599 మార్కులు
NEWS May 01,2026 10:07 am
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ NADలోని శ్రీ చైతన్య స్కూల్లో చదివిన జ్ఞానేశ్వరి, కేవలం ఒక్క మార్కుతో 600 మార్కుల లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. ఆంగ్లంలో ఆమెకు ఒక్క మార్కు తగ్గింది. పరీక్షలకు ముందు టైఫాయిడ్ బారిన పడటంతో ఆందోళన చెందినా, ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యి అద్భుతమైన మార్కులు సాధించారు.