వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
NEWS Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో CH. కావ్యశ్రీ 555 మార్కులతో రెండో స్థానం, G. నవ్య 548 మార్కులతో మూడో స్థానం, బి. మధులత 538 మార్కులతో నాలుగో స్థానం పొందారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వి.వి. రామరాజు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.