మెరుగైన పౌర సేవలు అందించాలి: కలెక్టర్
NEWS Apr 30,2026 10:37 pm
తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. అర్బన్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకుని, ప్రతిరోజూ కేంద్ర కార్యాలయంలో సేవలు అందించాలని చెప్పారు. ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసిల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు.