హనియాను సన్మానించిన ఖుతుబోద్దీన్ పాషా
NEWS Apr 30,2026 04:41 pm
మెట్పల్లి పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థిని హనియా హోరిన్ 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఘనంగా సన్మానించారు. విద్యలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అజీమ్, ముజీబ్, రహిమోద్దీన్, షారు, మజార్, అనష్, అబూజర్ తదితరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.