మమత కోటలో కమలం వికాసం?
NEWS Apr 29,2026 10:42 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ సర్వేలో బీజేపీ 146-161 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ (148) దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు, మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC 125-140 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. అలాగే పీ మార్క్ సర్వే టీఎంసీ: 118, బీజేపీ 152-175, కాంగ్రెస్0-1, ఇతరులు 2-6 వస్తాయని తెలిపింది.