ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
NEWS Apr 29,2026 09:43 pm
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక విక్రయాలు జరగాలని స్పష్టం చేశారు. అక్రమాలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.