నిర్మల్లో జాబ్ మేళా ప్రచారం ప్రారంభం
NEWS Apr 29,2026 09:43 pm
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. కలెక్టరేట్లో గోడ ప్రతులను ఆవిష్కరిస్తూ, మే 6న ఆదిలాబాద్లో జరిగే మేళాలో అర్హులైన యువతి, యువకులు పాల్గొనాలని కోరారు. QR కోడ్ లేదా అధికారిక వెబ్సైట్ https://satg.telangana.gov.in/prajapalana ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.