కడెం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
NEWS Apr 29,2026 09:42 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కడెం ప్రాజెక్టును సందర్శించారు. ఆపరేటింగ్ రూమ్ను పరిశీలించి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం, ఆయకట్టు, సాగునీటి సరఫరా వంటి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, భద్రత చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గేట్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.