మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి
NEWS Apr 29,2026 01:51 pm
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి ఎంజేపీవీసీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి. నరసింహ అభినందనలు తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, గురువులకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో సరైన దిశలో చదువును కొనసాగిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.