SSC ఫలితాల్లో శిశుమందిర్ ప్రభంజనం
NEWS Apr 29,2026 01:43 pm
శ్రీ సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ విద్యార్థులు SSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు నమోదు చేశారు. 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఉమ్మారెడ్డి నిశ్విత 570 మార్కులతో స్కూల్ టాప్గా నిలిచింది. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రధానాచార్యులు మోర రణధీర్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.