నేడు తెలంగాణ పదోతరగతి ఫలితాలు
NEWS Apr 29,2026 11:11 am
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.నవీన్ నికోలస్ పాల్గొంటారు. మార్చి 14 నుంచి ఈ నెల 13వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bse.telangana.gov.in వెబ్సైట్లలో హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి నేరుగా తెలుసుకోవచ్చు.